Breaking News

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో 43.5డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలో 12 మండలాలు, నంద్యాల 10, కడప జిల్లాలో 6 మండలాలు మొత్తంగా 9జిల్లాల పరిధిలోని 41మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

ఆదివారం(17-05-26) విజయనగరం,మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42-44.5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు.

రేపు మన్యం జిల్లా సీతంపేట మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే 34 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

రేపు వడగాలులు వీచే అవకాశం ఉన్న మండలాలు (34)

శ్రీకాకుళం జిల్లా: హిరమండలం, పాతపట్నం.

విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, రేగిడి ఆమదాలవలస,తెర్లాం, వంగర.

మన్యం జిల్లా:
బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం.

అల్లూరి జిల్లా: అనంతగిరి మండలం.

పోలవరం జిల్లా:
గంగవరం,రంపచోడవరం.

కాకినాడ జిల్లా:
గండేపల్లి, జగ్గంపేట, ఏలేశ్వరం.

తూర్పుగోదావరి జిల్లా: గోకవరం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం
37మండలాల్లో తీవ్రవడగాలులు, 66 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని
ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో ఆదివారం(17-05-26) మన్యం,అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.

శనివారం కర్నూలు(జి) నగరడోనలో 43.5°C, పల్నాడు(జి) బెల్లంకొండలో 42.6°C, నంద్యాల(జి) పెద్ద దేవలాపురంలో 42.5°C, ఎన్టీఆర్(జి) కొండపల్లి, పశ్చిమగోదావరి(జి) పెనుగొండలో 41.9°C, వైఎస్సార్ కడప(జి) చెన్నూరులో 41.6°C, మర్కాపురం(జి) నందన మారెళ్లలో 41.2°C, పోలవరం(జి) చింతూరులో 41.1°C, అనంతపురం(జి) పాతకొత్తచెరువులో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *