విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన సందర్భంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ దుర్గమ్మ గుడి ఆలయం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుజనా మిత్ర కోఆర్డినేటర్లతో కలిసి భక్తులకు, బాటసారులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి పార్టీల నేతలు , అభిమానులు పశ్చిమ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
Prajavartha Online Telugu News