All News

జిల్లాలోని ఓటర్లందరూ మే13న తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి

-సాధారణ ఎన్నికలు 2024 ను ప్రశాంత వాతావరణంలో సజావుగా పారదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం.. -ఏప్రిల్1 నాటికి 18 సం. లు నిండిన వారు ఓటరుగా ఏప్రిల్14 లోపు నమోదు చేసుకోవాలి: విలేకరుల సమావేశంలో..కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -ప్రశాంత వాతావరణంలో హింసకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు చర్యలు: జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ మేరకు సార్వత్రిక ఎన్నికలు …

Read More »

బిజెపి మీడియా ప్రతినిధుల కు… దిశానిర్దేశం చేసిన బిజెపి రాష్ట్ర ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్

-బిజెపి అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టుల సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల సందర్భంగా అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులు నిర్వర్తించాల్సిన పాత్ర పై బిజెపి రాష్ట్ర ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ అనేక సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా విమర్శలకు ప్రతి విమర్శలు వెంటనే చేయడం పై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ మీడియా కేంద్రాలుగా ఉన్న విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు లో మీడియా సెంటర్లను యాక్టివ్ చేయడం …

Read More »

పవన్ గొంతు కొస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది…

-నా కన్నీటితో చెప్తున్నా కాపు యువ సమాజిక వర్గాన్ని నాశనం చెయ్యొద్దు -పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే -పార్టీలో పని చేసిన వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదు… టిడిపి వారికే సీట్లు ఏందుకు ఇచ్చారు -రాష్ట్ర భవిష్యత్ కంటే ముందు పార్టీని నమ్ముకున్న వారి భవిష్యత్ ఏంటో పవన్ చెప్పాలి… -జనసేన పార్టీకి కాలం త్వరలోనే చెళ్ళిపోతుంది -భవిష్యత్తుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన లో నాకున్న పదవులకు …

Read More »

ఏపీలో మూడు రోజులు వర్షాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపటి (సోమవారం) నుంచి రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్సుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి ఊరటనిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read More »

సమాజంలో జర్నలిస్టులది గురుతర బాధ్యత

-ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. మణిరాం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులపై గురుతర బాధ్యత ఉందని, అది విస్మరించకుంటే సమాజానికి మేలు చేకూరుతుందని ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. మణిరాం పేర్కొన్నారు. పెన్ జర్నలిస్ట్స్ సంఘం విశాఖపట్నం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన భవన్ లో ఆదివారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉగాది ఉత్సవాల వేడుకలో మీడియా …

Read More »

మాదిగ, ఉపకులాల సమగ్రాభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే… : పేరుపోగు వెంకటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదిగ, ఉపకులాల సమగ్రాభివృద్ధికి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించి టిడిపి అధినేత చంద్రబాబు విజయ సాధనకు కృషిచేసి వర్గీకరణ సాధించుకుందామని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. అదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో 35 మాదిగ కులాల సంఘాల ప్రతినిధులతో రాజకీయ నిర్ణయంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాదిగలు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం …

Read More »

నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ

-సంక్షేమ రాష్ట్రం కావాలా.. సంక్షోభ రాష్ట్రం కావాలా? -ప్రగతి కోసం ఓటేయమని రాష్ట్ర ప్రజలకు విన్నపం -పామర్రు ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాగళం. ఇది ప్రజలగళం. నిమ్మకూరు.. సాధారణ కుటుంబం నుండి వచ్చిన నందమూరి తారకరామారావు పుట్టారు. ఎన్టీఆర్ ఒక చరిత్రకు స్ఫూర్తి. ఇక్కడి నుండి వచ్చిన వ్యక్తి తెలుగు వారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. దీక్ష పట్టుదల ఉంటే సామాన్యులు కూడా అధ్వితీయ శక్తులుగా మారుతారనడానికి ఎన్టీఆర్ నిదర్శనం. మనల్ని వదిలి …

Read More »

అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి తమ సంఘం ఎల్లపుడూ కృషి చేస్తుందని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు CA గడ్డం సత్యనారాయణ అన్నారు. ఆర్యవైశ్య విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ విధ్యా నిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన నూతన కార్యవర్గ సభ్యులకు అయన శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అమ్మ కల్యాణ …

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పాల్పడే వారిపై నిర్భయంగా ఫిర్యాదుల చెయ్యవచ్చు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పాల్పడే వారిపై నిర్భయంగా ఫిర్యాదుల చెయ్యవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన  ఫిర్యాదుల నమోదు కోసం 1950 ట్రోల్ ఫ్రీ నెంబర్ తో పాటు గా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ 1800- 425 – 2540  కలెక్టరేట్ లో ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ , వీటితో పాటు గా సి విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై …

Read More »

యువత మరియు పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలనే లక్ష్యంతో ఇసిఐ చేపడుతున్న పలు కార్యక్రమాలు

-2024 సార్వత్రిక ఎన్నికలలో సామాజిక మాధ్యమాల ద్వారా యువత మరియు పట్టణ ఓటర్లను నిమగ్నం చేయాలనే లక్ష్యంతో ఇసిఐ చేపడుతున్న పలు కార్యక్రమాలు -ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి ‘టర్నింగ్ 18’ ప్రచారం ద్వారా యువ, మొదటిసారి ఓటర్లను ప్రోత్సహించడం -పోలింగ్ వ్యవస్థతో సహా ఎన్నికల ప్రక్రియలోని అన్ని వాటాదారుల ప్రాముఖ్యతను గుర్తించి ఏ ఒక్క ఓటరూ వెనకబడకూడదు అనే నినాదంతో ‘యు ఆర్ ది వన్’ కార్యక్రమం. -యువత లక్ష్యంగా ‘జెనరేషన్ జీ’ విధానంలో ఆకర్షణీయమైన కంటెంట్ తయారీ, వితరణ -ఎన్నికల ప్రక్రియపై నకిలీ …

Read More »