-జాప్యం లేకుండా పూడికతీత పనులు -వేగవంతంగా కొత్త, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురవ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండలంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందుకున్న అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని …
Read More »Monthly Archives: November 2024
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1 కోటి పైగా చెక్కులు అందజేసిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
బల్లికురువ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బల్లికురువ మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అద్దంకి నియోజకవర్గం లోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని సుమారు 33 మందికి రూ. 28 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 22 మందికి రూ. 83 లక్షలకు పైగా ఎల్ఓసీలు …
Read More »నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహా రిసెప్షన్ కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ హాజరై నూతన దంపతులైన అంజలి బిర్లా, అనీష్ లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. . రాజస్థాన్ లో నవంబర్ 12వ తేదీ అంజలి బిర్లా, అనీష్ లకు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సోమవారం ఢిల్లీ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Read More »ఎపిలో ప్రసాద్ పథకం కింద ఎంపికైన దేవస్థాన వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలో ప్రసాద్ పథకం కింద ఆమోదం పొందిన ప్రస్తుత ప్రాజెక్టుల పరిస్థితి, వాటికి మంజూరు చేసిన నిధులు, వినియోగం పై పూర్తి వివారాలు, అలాగే ప్రసాద్ పథకం కింద కొత్త ప్రతిపాదనలు ఆమోదం తెలిపారా? లేదా పరిశీలనలో వున్నాయా అనే విషయం తెలపాలంటూ పలు ప్రశ్నలు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, కర్నూల్ ఎంపి బస్తిపాటి నాగరాజు, కియోంజర్ ఎంపి నబ చరణ్ మాఝీ, కుషి నగర్ ఎంపి విజయ్ కుమార్ దూబే …
Read More »గత ఐదేళ్లలో ఎన్.పి.సి.ఎ కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల పర్యావరణ వ్యవస్థల సంరక్షణ జాతీయ ప్రణాళిక (NPCA) కింద పునరుద్ధరించబడిన వెట్లాండ్స్ ( చిత్తడి నేలలు) , సరస్సుల సంఖ్య వివరాలు, అలాగే గత ఐదేళ్లలో ఈ ప్రణాళిక కింద ఆంధ్రప్రదేశ్కు ఏడాది వారీగా విడుదల చేసిన నిధుల వివరాలు తెలపాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, హిందూపురం ఎంపి బి.కె. పార్ధసారథి, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు, విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు లతో కలిసి సోమవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో …
Read More »జగన్ తప్పు చేయకపోతే అమెరికా వెళ్లి నిరూపించుకోవాలి : మాజీ ఆర్టీసీ ఛైర్మనో గోనె ప్రకాశ్ రావు
-అదానీ కేసులో జగన్ తప్పించుకోలేడు -మీడియా సమావేశంలో గోనే అదానీ, జగన్ పై సంచలన వ్యాఖ్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ లంచం ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు వాస్తవం కాకపోతే వైసిపి ఎమ్మెల్యే జగన్ అమెరికా వెళ్లి అక్కడ కోర్ట్ లో నిజం నిరూపించుకోని రావాలని మాజీ ఆర్టీసీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అమెరికా న్యూయార్క్లో నమోదైన …
Read More »ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పార్వతిపురం మన్యం జిల్లా, బొబ్బిలి లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 09 గంటల వరకు ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు, వై రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు హాజరయ్యారు. ఈ సమావేశానికి పార్వతిపురం మన్యం జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్రావు, సెక్రెటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ శంకర్రావు, …
Read More »బొండా ఉమ అభినందన సభ-సన్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బొండా ఉమ అభినందన సభ-సన్మానం గాంధీనగర్ లో సోమవారం విజయవాడ గాంధీనగర్ “G-3” సినిమా ధియేటర్ (రాజ్ యువరాజ్ ) వద్ద గల మా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మరియు NDA కూటమి నేతల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియమించిన సందర్భంగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, నియోజకవర్గ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా శ్రమిస్తున్న ప్రజా నాయకులు …
Read More »ఆచంట వెంకటరత్నం నాయుడు 9వ వర్ధంతి
తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆచంట వెంకటరత్నం నాయుడు 9వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:-ఆచంట వెంకటరత్నం నాయుడు గారు విజయవాడకు సమీపంలోని ‘నున్న’ అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆచంట, చిన్నప్పటి నుంచి నాటకాలపై మక్కువ చూపించి, తెలుగు రంగస్థలంలో ఒక చిరస్మరణీయ నటుడు అని, ఆయన తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇటీవల చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలోని ఇద్దరుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గం లోని 29వ డివిజన్ మధురానగర్ ముక్కుల రాధాకృష్ణ కి 1,59679 వేలరూపాయల చెక్కును అలాగే 24వ డివిజన్ గిరిపురం 48,727 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-అత్యవసర పరిస్థితుల్లో పేద మజ్జిగ తరగతి వారికి …
Read More »
Prajavartha Online Telugu News