Breaking News

Monthly Archives: November 2024

ఎన్పీసీఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ ఈ నెల 30 నాటికి తప్పకుండా పూర్తి చేయాలి

-పీజీ ఆర్ ఎస్ అర్జీలు నాణ్యతగా బియాండ్ ఎస్ ఎల్ ఎ కు వెళ్లకుండా నాణ్యతగా పరిష్కరించాలి -ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వరాదు -పాట్ హోల్ ఫ్రీ రహదారుల పనులు నాణ్యతగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : పిజిఆర్ఎస్ అర్జీల పెండింగ్ అంశాలపై, ఉచిత ఇసుక అమలు పై, ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్, ఎంఎంఎస్ఎంఈ సర్వే, నరేగా, …

Read More »

నవంబరు 25 నుంచి డిసెంబర్ 23 వరకు లింగ ఆధారిత హింసకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా లింగ ఆధారిత హింసకు వ్యతిరేకoగా అవగాహన కార్యక్రమాలను నవంబరు 25 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో తిరుపతి రూరల్ మండలంలో డి ఆర్ డి ఎ వారి అధర్వoలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 222 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్)కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో అర్థవంతoగా పరిష్కారం చూపాలని రీ ఓపెన్ కు తావు లేకుండా అర్జీదారుని సంతృప్తి మేరకు …

Read More »

నకిలీ పాఠశాలల గురించి పార్లమెంట్ లో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు ప్రారంభం అయిన శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ని నకిలీ పాఠశాలల విషయమై దిగువ తెలిపిన విధంగా ప్రశ్నించడం జరిగింది. (ఎ) పెద్ద సంఖ్యలో పాఠశాలలు డమ్మీ అడ్మిషన్ల సాధనలో పాల్గొంటున్నాయని మరియు CBSEకి పెద్ద ముప్పును సృష్టిస్తున్నాయని ప్రభుత్వానికి తెలియదా; (బి) అలా అయితే, దేశంలో నడుస్తున్న డమ్మీ పాఠశాలల వివరాలు, రాష్ట్రాల వారీగా మరియు జిల్లాల వారీగా తెలియ పరచండి ; (సి) కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు …

Read More »

ఈనెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, మొదలైన వాటిలో భారత రాజ్యాంగ పీఠికను ఉదయం 11:30 గంటలకు సామూహికంగా చదవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓక ప్రకటనలో తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను గౌరవించడం, గుర్తించడం, రాజ్యాంగాన్ని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) గా జరుపుకుంటామని తెలిపారు. భారతదేశం, ఒక …

Read More »

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశం నిర్వహించుటకు సంసిద్ధం కావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే డిసెంబర్ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశం నిర్వహించుటకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ …

Read More »

సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ పరిశ్రమలు స్థాపించి, ఉపాధి పొందేలా చర్యలు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ పరిశ్రమలు (food processing units) విరివిగా స్థాపించి, ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం (prime minister formalisation of micro food processing enterprises scheme) అమలుకు …

Read More »

యువతకు స్ఫూర్తిదాయకంగా “యువ కెరటాలు” కార్యక్రమం

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : యువతకు స్ఫూర్తిదాయకంగా “యువ కెరటాలు” కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి యువ కెరటాలు కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్ల నిస్తేజంగా ఉన్న యువతను చైతన్యవంతం చేయుటకు, వారిలో నూతన ఉత్సాహం ఉత్తేజం కలిగించేందుకు వారిలో …

Read More »

ప్రజల నుండి అందే అర్జీలను అత్యధిక ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను అత్యధిక ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి మచిలీపట్నం ఆర్డిఓ కే.స్వాతి లతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో …

Read More »

ప్రత్యేక ఆకర్షణగా గాంధీ కొండ ప్లానిటోరియం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ కొండ వద్ద ఉన్న ప్లానిటోరియం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వన్ టౌన్ గాంధీ హిల్ లో ఉన్న ప్లానిటోరియంలో ప్రజలు ఇకనుండి వీక్షించవచ్చని అన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే గాంధీ హిల్ లో అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు ఏర్పాటు చేసిన ప్లానెటోరియం ను ప్రజలందరూ వీక్షించవలసిందిగా కోరారు. ప్రజలందరికీ …

Read More »