Breaking News

Monthly Archives: November 2024

సీఎంఆర్ఎఫ్ తోపాటు ఇతర సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాలి

-సిఎంఆర్ఎఫ్ పథకాన్ని ఉపయోగించుకోండి వైద్య ఖర్చుల అప్పులను తీర్చుకోండి -15వ డివిజన్ లో సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3 లక్షల విలువచేసే చెక్కులను అందజేసిన తూర్పు -నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ -సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15 వ డివిజన్ లో సీఎంఆర్ ఎఫ్ ద్వారా మంజూరైన సుమారు రూ.3 ‌ లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ స్వయంగా అందజేశారు. …

Read More »

వక్ఫ్‌ సవరణల బిల్లుతో ప్రజాస్వామ్యానికి ముప్పు

-ఓటర్లలో మత విభజన కోసం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -జేపీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -మనువాదాన్ని తెచ్చే ప్రయత్నం: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేత మస్తాన్‌ వలి -వక్ఫ్‌ బిల్లును పార్లమెంటులో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు వ్యతిరేకించాలి: మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ -లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్‌ బిల్లు నిరసన సభ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్‌ బోర్డు సవరణల బిల్లు ఆమోదం …

Read More »

శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  స్వగృహమునందు య్యప్ప పడిపూజ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  స్వగృహమునందు ఆదివారం అయ్యప్ప పడిపూజ మరియు భజన అఖండ దీపారాధన, కార్యక్రమం బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి గురుస్వామి చే కేరళ సంప్రదాయంలో పడిపూజ కార్యక్రమము అంగరంగ వైభవముగా తెలుగుదేశం “యువ నాయకులు బొండా సిద్దార్ధ స్వామి” ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగినది. ఈ భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా :-ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాల్గొని భక్తి శ్రద్దలతో 41రోజు …

Read More »

ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు నిర్మించి తీరుతాం

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -10 వేల మందికి ఉపాధి కల్పన -పేదలకు, చేనేతలకు మధ్య చిచ్చు పెట్టిన జగన్ -ఆయన చేనేత ద్రోహి : జగన్ మంత్రి సవిత ఫైర్ కర్నూలు/ఎమ్మిగనూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కు నిర్మించి తీరుతామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి స్పష్టంచేశారు. ఆదివారం ఎమ్మిగనూరులో టెక్స్ టైల్స్ పార్కుకు కేటాయించిన స్థలాన్ని …

Read More »

అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -గుంతకల్లులో కనకదాసు కాంస్య విగ్రహ ఆవిష్కరించిన మంత్రి -తిరుపతిలో కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి -టీడీపీతోనే కురబలకు రాజకీయ ప్రాధాన్యం : మంత్రి గుంతకల్లు, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో భక్త కనకదాస విగ్రహం ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత తెలిపారు. తిరుపతిలోనూ భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గుంతకల్లు పట్టణంలో భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి …

Read More »

ఈ నెల 25వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం…

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం …

Read More »

ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలకు సంబంధించి ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించకూడదు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలకు సంబంధించి ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించకూడదని లేదా తరగతులు, ప్రాక్టికల్స్ మొదలైన వాటికి దూరంగా ఉంచకూడదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలకు సంబంధించి కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయని, తరగతులు, ప్రాక్టికల్స్‌కు హాజరుకాకుండా అడ్డుకుంటున్నారని జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా కాలేజీలకు విడుదల చేయబడుతుందని, అదేవిధంగా …

Read More »

టి.టి.డి ఛైర్మ‌న్ బి.ఆర్. నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

హైద‌రాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ బి.ఆర్.నాయుడును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. హైదరాబాద్ లోని ఆయ‌న‌ కార్యాల‌యంలో బి.ఆర్.నాయుడును క‌లిసి పుష్ఫ‌గుచ్చం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. టివి 5 చైర్మ‌న్ గా ఇరు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన బి.ఆర్ నాయుడు స్వ‌యంకృషి, ప‌ట్టుద‌ల‌, ఆధ్యాత్మిక నిబద్ధ‌త‌కూ ప్ర‌తీక అని ఎంపి కేశినేని శివనాథ్ కొనియాడారు. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌, భ‌క్తుల మ‌నోభావాలు, ఆగ‌మ శాస్త్రాల ప్రాధాన్య‌త అన్ని తెలిసిన బి.ఆర్.నాయుడుకి టిటిడి చైర్మ‌న్ గా …

Read More »

మత రహిత సమాజాన్ని కోరుకున్న గోరా స్ఫూర్తి ప్రధాత

-డా|| జి. సమరం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మతం మనిషిని బానిసగా మారుస్తుందని, స్వేచ్ఛగా శాస్త్రీయంగా ఆలోచింపనివ్వదని, మత రహిత సమాజమే సమాజ పురోగతికి తోడ్పడుతుందని, కోట్లాది ప్రజలకు వివరించి ఆచరించిన మహనీయుడు కీ.శే. గోపరాజు రామచంద్రరావు (గోరా) అని ప్రముఖ వైద్యులు డా||జి. సమరం కొనియాడారు. ఈనెల 24వ తేదీ, ఆదివారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో గోపరాజు రామచంద్ర రావు జీవిత ప్రస్థానంపై జరిగిన సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ జి. సమరం హాజరై ప్రసంగించారు. సనాతన …

Read More »

విజయవాడలో ఘనంగా ”వేవ్స్ 2025”

-‘విజయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్’ ప్రాంగణంలో ‘యువ ఉత్సవ్ 2024’ నిర్వహణ -‘వేవ్స్ 2025’ విద్యార్థులకు గొప్ప అవకాశం: రాజిందర్ చౌదరి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త “వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025″లో భాగంగా జరుగుతున్న పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘జిల్లా స్థాయి యువ ఉత్సవ్ 2024’ సందర్భంగా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ‘వేవ్‌ సమ్మిట్ ఇండియా’ …

Read More »