Breaking News

Monthly Archives: November 2024

ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

-శాసనసభ్యులు సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. 52వ డివిజన్ కొత్తపేట లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మెట్లు, సైడ్ కాలువలకు రూ 19 లక్షలతో చేపట్టనున్న నిర్మాణం 53 వ డివిజన్ పరిధిలో సుబ్బరామయ్య వీధి నుండి హిందూ హైస్కూల్ వరకు రూ 62 లక్షలతో చేపట్టనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ …

Read More »

గ‌త ప్ర‌భుత్వ మూడుముక్క‌లాట‌తో అమ‌రావ‌తికి ఎలాంటి సంస్థ‌లు రాలేదు

-కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అమ‌రావ‌తికి వ‌చ్చేందుకు సంస్థ‌లు ఆస‌క్తి -గ‌తంలో భూకేటాయింపులు చేసిన సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని సీఆర్డీయేకు ఆదేశాలు -మంత్రివ‌ర్గ ఉపసంఘం నిర్ణ‌యాలు -స‌మావేశం త‌ర్వాత మీడియాతో మంత్రులు నారాయ‌ణ‌,ప‌య్యావుల కేశ‌వ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం ఆడిన మూడుముక్క‌లాట తో అమ‌రావ‌తిలో భూములు పొందిన సంస్థ‌లు నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుకు రాలేద‌న్నారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో అమ‌రావ‌తిలో భూములు కేటాయించిన వివిధ సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని సీఆర్డీఏ అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు..స‌చివాల‌యంలోని …

Read More »

గత ప్రభుత్వ అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపం

-అడ్డగోలు దోపిడీ కోసం వ్యవస్థలను సర్వనాశనం చేశారు -స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు -ఇప్పటికి తేలింది రూ.9,74,556 కోట్ల అప్పులు…తవ్వితే ఇంకెంత ఉంటాయో? -1995 నాటి ప్రభుత్వంలో కూడా ఇంతటి దారుణ పరిస్థితులు లేవు -సమస్యలు అధిగమించి ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం -రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని చెప్పడం లేదు -రాష్ట్ర ఆదాయం పెంచేందుకు గత ఐదేళ్లలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు -అసమర్ధపాలనలో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది…తలసరి ఖర్చు పెరిగింది -2018-19 నాటికి 13.5 శాతం ఉన్న …

Read More »

ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు

-అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం -మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరం తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను ఎపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరెన్నిగన్న రీసెర్చి ఇనిస్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత …

Read More »

రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పూర్తిగా ధ్వంసమైన పలు రాష్ట్ర రహాదారులు, జిల్లా ప్రధాన రహదారులు, ఇతర జిల్లా రహదారులకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులే లక్ష్యంగా మరమ్మతు పనులను వేగవంతం చేసేందుకు నేడు 3 జీవోలను సైతం విడుదల చేసినట్లు మంత్రి …

Read More »

ఆర్టీజీఎస్ ప‌నితీరు ఆద‌ర్శ‌ప్రాయం

-మ‌ద్రాసు ఐఐటీ ప్ర‌తినిధుల ప్ర‌శంస‌ -ఆర్టీజీఎస్ ప‌నితీరును వివ‌రించిన సీఈఓ దినేష్ కుమార్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ రంగంలో ఆర్టీజీఎస్ లాంటి సాంకేతిక వ్య‌వ‌స్థ ఉండ‌టం అద్బుత‌మ‌ని, ఇదో వినూత్న ఆలోచ‌న‌, దీని ప‌నితీరు అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని మ‌ద్రాసు ఐఐటీ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ వీళినాథ‌న్ కామ‌కోటి అన్నారు. స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మ‌ద్రాసు ఐఐటీకి చెందిన ప్ర‌తినిధుల‌ బృందం సంద‌ర్శించింది. ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి ప్ర‌ద్యుమ్న‌, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ లు రియ‌ల్ టైమ్ …

Read More »

నిడదవోలు నియోజకవర్గంలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 4 పనులకు రూ. 261 లక్షలు మంజూరుకు కృషి చేసిన మంత్రి కందుల దుర్గేష్

-నిధుల విడుదల గురించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కందుల దుర్గేష్ కి తెలిపిన రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి -అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, రోడ్లు మరియు భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన నిధులు విడుదల చేయించి నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి కందుల …

Read More »

ఏస్పా భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ముగింపు ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏస్పా భారత్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ ఆవరణలో వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ముగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేపటి ప్రపంచ ఆరోగ్యం ఆనందం ఆక్యుపంక్చర్ సైన్స్ తోనే సాధ్యమని ఎస్పా భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మా కాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆక్యుపంక్చర్ ను ప్రతిభావంతమైన వైద్యంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది, యునెస్కో దీనిని విడదీయలేని అతి పురాతన మానవతతో కూడినది అని పేర్కొంది. భారతదేశం ఆక్యుపంక్చర్ వైద్యాన్ని ప్రత్యేక విభాగ …

Read More »

కార్తీక పౌర్ణమి నాడు శివారాధన.. అనంత కోటి పుణ్య ఫలం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం శివాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహాశివుడిని ప్రసన్నం చేసుకున్నారు. హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ భక్తులు చేసిన భగవత్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో శుక్రవారం వైసీపీ …

Read More »

డ్రోన్ ఆపరేటర్లు గా మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ (ఉమెన్ డ్రోన్ పైలెట్స్)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమిషనర్ఎస్.వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ వినూత్నంగా ఆలోచించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించు కోవడం ద్వారా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ను నియంత్రించడం, నేరాలును ఛేదించడం, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు వివిధ వి. ఐ. పి ల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ …

Read More »