Breaking News

Monthly Archives: December 2024

జిల్లా ఎఫ్ఎస్‌వోగా ఎ.ర‌వీంద్ర‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి (ఎఫ్ఎస్‌వో)గా ఎ.ర‌వీంద్ర‌రావు సోమ‌వారం విజ‌య‌వాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లోని కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అనంత‌రం జిల్లా క‌లెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌ను క‌లెక్ట‌రేట్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి, పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు. గ‌తంలో నందిగామ ఆర్‌డీవోగా ప‌నిచేసిన ర‌వీంద్ర‌రావును ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీస‌ర్‌గా నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఉత్త‌ర్వులు జారీచేసింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఆయ‌న ఎఫ్ఎస్‌వోగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. టీమ్ ఎన్‌టీఆర్‌లో భాగ‌మ‌వుతూ జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి కృషిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ …

Read More »

లింగ వివ‌క్ష లేని స‌మాజ స్థాప‌నకు స‌మ‌ష్టిగా కృషిచేద్దాం

– లింగ ఆధారిత హింస‌ను ప్ర‌తిఒక్క‌రూ వ్య‌తిరేకించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లింగ వివ‌క్ష లేని స‌మ స‌మాజ స్థాప‌న‌కు స‌మ‌ష్టిగా కృషిచేద్దామ‌ని.. లింగ ఆధారిత హింస ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించ‌కూడ‌ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో డీఆర్‌డీఏ-సెర్ప్ ఆధ్వ‌ర్యంలో జెండ‌ర్ ఆధారిత హింస‌కు వ్య‌తిరేకంగా జాతీయ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ …

Read More »

రూ.1లక్షల యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండ‌లం కొత్త రేపూడి గ్రామానికి చెందిన జి.మంగ‌సాయి త‌న గుండె సంబంధిత చికిత్స కోసం తక్షణ ఆర్ధిక సాయంకై సీఎంఆర్ఎఫ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) కి ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకున్నారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ సూచ‌న‌ల మేర‌కు మంజూరైన రూ.1లక్షల యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి ని సోమ‌వారం జి.మంగ‌సాయి భ‌ర్త జి.వి.రామ‌ప్ర‌సాద్ కి ఎంపి కార్యాలయ సిబ్బంది అందజేశారు. తన భార్య మంగ‌సాయి …

Read More »

అరవింద్ కేజ్రీవాల్ మీద జరిగిన దాడికి కందుకూరులో నిరసన

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : అరవింద్ కేజ్రీవాల్ మీద జరిగిన దాడికి నెల్లూరు జిల్లా కందుకూరులో సోమవారం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన  కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత విద్య ఉచిత వైద్యం సురక్షిత నీరు అప్పులు లేని పరిపాలన అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో దేశ ప్రజలకు ఒక …

Read More »

బిజెపి లో నాయకత్వ మార్పులు

-రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జిల్లాలో త్వరలో నాయకత్వ మార్పులు జరగనున్నాయని బిజెపి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ రాజు అన్నారు.ఎన్టీఆర్ జిల్లా బిజెపి సంఘటన పర్వ్ నేతలు, మండల అధ్యక్షులు, ముఖ్య నేతలతో భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సూర్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ …

Read More »

ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

-280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ -సెకండరీ హెల్త్ లో 97 స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీ -డిసెంబర్ 4 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం -రెగ్యులర్‌ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా భర్తీ -అభ్యర్థుల అర్హతలు, మార్గదర్శకాలు నోటిఫికేషన్‌లో వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 …

Read More »

అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్ధవంతంగా పనితీరుని ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్ధవంతంగా పనితీరుని ఉండాలనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డ్వామా, స్త్రీ శిశు సంక్షేమ, రెవిన్యూ భూ సంబంధ , పరిశ్రమల శాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధిహామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ ప్రగతి సాధించిన మండల స్థాయి అధికారులు మెరుగైన ఫలితాలు సాధించడం …

Read More »

క్రీడా జ్ఞాన పరిక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి అదేశములను అనుసరించి, ఛైతన్య కస్యప్ పౌండేషన్ వారు 08.12.2024 నాడు క్రీడా భారతి అవార్డు కొరకు 4 వ ఆన్ లైన్ లో క్రీడా జ్ఞాన పరిక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ది అధికారి డి.ఎం.ఎం.శేషగిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో భాగముగా 12 సం.లు & పై బడిన వయసు గల క్రీడాకారులు, విధ్యార్ధులు, తల్లితండ్రులు, పౌరుల నుండి పెద్ద ఎత్తున Online లో వ్యక్తిగత, …

Read More »

“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పి జి ఆర్ ఎస్ )లో వచ్చిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలి

-ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని, రీ ఓపెన్ కారాదు. -ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు నుంచి126 అర్జీలను స్వీకరించాం.. -జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ పి. ప్రశాంతి 126 అర్జీలను …

Read More »

డిసెంబర్ 5వ తేదీ నాటికి తీసుకున్న చర్య పై నివేదిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్సీ ఎన్నికలు, నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం పై జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పొలింగ్ కేంద్రాల వద్ద లోపలికి బయటకి ప్రత్యేక మార్గాలు, బందోబస్తు, పొలింగ్ కేంద్రాల, రీసేప్షన్ కేంద్రాల మ్యాప్ సిద్ధం చెయ్యాలనీ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల …

Read More »