Breaking News

Daily Archives: April 3, 2025

స్టాఫ్ నర్స్ లకు శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ART కేంద్రాలలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్ మరియు స్టాఫ్ నర్స్ లకు గత మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమం నిర్వహించామని జాయింట్ డైరెక్టర్ (CST) డా. టి. మంజుల చెప్పారు. విజయవాడ ఐలాపురం హోటల్ లో గురువారం శిక్షణ ముగింపు కార్యక్రమంలో డా. మంజుల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ Dr శ్రీమతి …

Read More »

హోటల్‌ రంగానికి రాయితీలపై హర్షం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హోటల్‌ రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయితీలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.వి.స్వామి తెలిపారు. గురువారం గుణదలలోని హయత్‌ప్లేస్‌ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రాయితీలు చూసి రాష్ట్రంలో మరిన్ని స్టార్‌ హోటల్స్‌ వస్తున్నాయని చెప్పారు. స్టార్‌ హోటల్స్‌కు ఎక్సైజ్‌ సుంకం ఏటా 66 లక్షలు చెల్లిస్తున్నామని దానికి తగ్గట్టుగా వ్యాపారాలు ఉండకపోవడంతో నష్టం వస్తున్నదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై సానుకూలంగా స్పందించిన …

Read More »

ఏ బిడ్డా అనాధగా  మిగిలిపోకూడదు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఏ బిడ్డా కూడా అనాధగా  మిగిలిపోకూడదని, అట్టి పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతుల ప్రయత్నం ఎంతో మందికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావుతో కలిసి జిల్లాలోని వివిధ శిశు గృహల్లో ఉంటున్న ముగ్గురు చిన్నారులను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా జిల్లా బాలల రక్షణ విభాగం (డిస్ట్రిక్ట్ చైల్డ్ …

Read More »

మంగినపూడి బీచ్ ను అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ను అత్యద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం రాత్రి మంత్రివర్యులు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్,  జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ లతో కలిసి మంగినపూడి బీచ్ ను పరిశీలించారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణ గమనించిన ముఖ్య కార్యదర్శి బీచ్ అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయని  సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా …

Read More »

బెల్టు షాపులపై కొరఢా ఝుళిపించాల్సిందే

– నాటు సారా రహితం రాష్ట్రంగా ఏపీని మారుద్దాం – నూతన ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థపై దృష్టిసారించండి – నీరా సొసైటీల ఏర్పాటు, తాటి ఉత్పత్తుల అభివృద్ధికి కమిటీ – నూతన డిపోల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి – ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని నాటు సారా రహితంగా తయారు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నవోదయం 2.0 కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ …

Read More »

ఆం.ప్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి జిల్లా రాక

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటలకు గౌ. ఆం.ప్ర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని 3:30 గంటలకు తిరుమండ్యం గ్రామం, వడమాలపేట మండలం వరి ధాన్య సేకరణ కేంద్రం (పి పి సి) పరిశీలన మరియు రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం సాయంత్రం 5గంటలకు కెనడీ నగర్ లక్ష్మీపురం సర్కిల్, తిరుపతి నందు దీపం-2 ఎల్పిజి లబ్ధిదారులకు సిలిండర్ పంపిణీ …

Read More »

పుత్తూరు, వడమాల పేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలి

-వేసవి దృష్ట్యా ఎక్కడ నీటి సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ -రెండు మండలాలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఎంఎల్ఏ గాలి భాను ప్రకాష్ పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : పుత్తూరు, వడమాలపేట మండలాల అభివృద్ధికి సంబంధిత అధికారులు కృషి చేయాలి అని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం పుత్తూరు పురపాలక సంఘము సమావేశ మందిరము నందు నగరి నియోజకవర్గం, పుత్తూరు, వడమాలపేట మండలాల అబివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కార …

Read More »

ఆం.ప్ర రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రాక

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల ఏప్రిల్ 4వ తేదీన శుక్రవారం గౌ. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లాలో పర్యటించనున్నారనీ జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. తేదీ 4న నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం సాయంత్రం ఆరు గంటలకు గూడూరు లోని ఆది శంకర ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ కళాశాల నందు జరిగే సిల్వర్ జూబ్లీ వేడుకలలో మరియు మహర్షి మహేష్ యోగి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో …

Read More »

శ్రీరామనవమి సందర్భంగా క్రొత్త టూర్ ప్యాకేజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ సి.హెహ్. శ్రీనివాస రావు శ్రీరామనవమి సందర్భంగా క్రొత్త ప్యాకేజీ టూర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటన లో తెలియజేశారు. ప్యాకేజ్ టూర్ వివరాలు: ఒంటిమిట్ట, దేవుని కడప, తాళ్ళపాక, నందలూరు. బస్సు యాత్ర తేదీల వివరాలు: ఏప్రిల్ 4 వతేది నుండి ఏప్రిల్ 11 వ తేది వరకు.ఒక మనిషి కి రూపాయలు: 700.00(నాన్ ఏసీ బస్, గైడ్ సౌకర్యము తో కలిపి).బస్సు బయలుదేరు సమయం: ఉదయం 8 …

Read More »

ప్రభుత్వం పీజీ ఆర్ ఎస్ అర్జీలు నాణ్యతగా పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది

-పీజీఆర్ఎస్ నందు సమస్య పరిష్కారం అయిన అర్జీదారునితో ర్యాండంగా తనిఖీ నిర్వహించి ఆరా తీసిన సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ -జెసి శుభం బన్సల్ కోట, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం పీజీ ఆర్ ఎస్ అర్జీల నాణ్యతగా పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పిజిఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం సకాలంలో అర్జీదారుల సంతృప్తి మేరకు …

Read More »