Breaking News

Daily Archives: June 5, 2026

​హజ్ యాత్రికులకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరంలో హజ్ యాత్రను ముగించుకుని ఈరోజు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన హజ్ యాత్రికులకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ​యాత్రికులు రాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా ముందస్తుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయ అధికారులతో కలిసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. సౌదీ నుండి చేరుకున్న ముస్లిం సోదర సోదరీమణులను చైర్మన్ …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం వాంబే కాలనీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ ఏ. జె. సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా …

Read More »

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని భవానిపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేశారు.

Read More »

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 63వ డివిజన్ ఉడా కాలనీ మెయిన్ రోడ్డులో, 58వ డివిజన్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటి …

Read More »

ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాలలో నిర్వహించిన హరితాంధ్ర కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “Inspired by Nature for Climate for our future” అనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 థీమ్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు విజయవాడ నగరంలో …

Read More »

ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో పిజిఆర్ఎస్ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గాలలో ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలసి నియోజకవర్గ కేంద్రమైన పెడనలోనీ మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక…. మీకోసం కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పంచాయతీల పరిధిలో పరిష్కరించే చిన్నచిన్న సమస్యలను కూడా …

Read More »

పర్యావరణ సమతుల్యత.. భావితరాలకు సురక్షిత భవిష్యత్తు

-ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలి -మంత్రి కొల్లు రవీంద్ర -ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగినపూడి బీచ్‌లో భారీ స్వచ్ఛత కార్యక్రమం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యతను పాటించకపోవడం వల్లే ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షాల కొరత, అనారోగ్య సమస్యలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ పర్యావరణ …

Read More »

మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను విరమించుకోవాలి

-కార్పొరేట్లకు భూములు, ఆస్తులు, పౌరసేవల అప్పగింత తగదు -తక్షణమే జీవో 673 రద్దు చేయాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అందిస్తున్న ప్రధాన కానుక మున్సిపల్ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ దిశగా నడిపించడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన స్థానిక సంస్థలను వ్యాపార సంస్థలుగా మార్చే ప్రమాదకర విధానాలు రాష్ట్రంలో వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ …

Read More »

మోదీ అవినీతి పాలనకు నిదర్శనమే రాజేశ్ ఎక్స్‌పోర్టు కంపెనీ కుంభకోణం

-బ్యాంకులు, ఎలఐసీ వాటాదారులా? -నీట్, సిబిఎసఈ పరీక్షల నిర్వహణలో వైఫల్యం -ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సత్వరమే చెల్లించాలి -సంపద సృష్టికాదు, అప్ప్పుల సృష్టే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం -సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ -పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి -మున్సిపల్ సేవలు ప్రైవేట్ అప్పగించే చర్యలు విడనాడాలి -పర్యావరణ పరిరక్షణలో ప్రచారానికే పరిమితం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజేష్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ కంపెనీలో రూ.15 లక్షల 15 వేల కోట్ల …

Read More »

అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా

– ప్రత్యేక కోర్టుకు క్యాబినెట్ ఆమోదం హర్షణీయం.. – అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బివి చంద్రశేఖర రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత 12 సంవత్సరాలుగా పోరాడిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విజయవాడలోని దాసరి భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ …

Read More »