కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరులో డ్రెడ్జింగ్పై ఎంపీపీ కొవ్వూరు ఫిర్యాదు మేరకు 22వ తేదీ నుంచి ఆర్డీఓ డాక్టర్ రాణి సుస్మిత ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టి కొనసాగుతున్నాయి. డ్రెడ్జింగ్ బోట్లను కనిపెట్టేందుకు.ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఔరంగాబాద్-2 పాయింట్ వద్ద 23వ తేదీ రాత్రి 7:15 గంటలకు 3 డ్రెడ్జింగ్ బోట్లను గుర్తించారు. కొవ్వూరు తహశీల్దార్తో పాటు ఆర్డిఓ తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ సహాయ ఇంజనీర్ ఆధ్వర్యం టాస్క్ ఫోర్స్ బృందం బోట్లను సీజ్ చేయడానికి అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి అక్రమ డ్రేజ్జింగ్ కు పాల్పడుతున్న మూడు డ్రేజ్జింగ్ నిర్వాహకులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయ వలసినదిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించి నట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు.
Prajavartha Online Telugu News