Breaking News

బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు పట్టణంలోని కె.వి. స్టేట్ హోం మరియు బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శించారు. ముందుగా ప్రకాష్ నాగర్ లోని కె.వి. స్టేట్ హోం ను సందర్శించి అక్కడ వసతులని పరిశీలించారు. ఆ తరువాత బాల సదనమును సందర్శించి చిన్నారులతో మాట్లాడరు. వారికి అక్కడ ఏ విధమైన అసౌకర్యం ఉన్న తెలియజేయాలన్నారు. అనంతరం ఉద్యోగినుల వసతి గృహమును సందర్శించి వసతులను పరిశీలించారు. ఆ వసతి గృహ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అక్కడ అందచేస్తున్న ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శించిన న్యాయమూర్తి అక్కడి వసతులను పరిశీలించి బాలురుతో కాసేపు మాట్లాడరు. శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలన్నారు. న్యాయ మార్గాన్ని అనుసరిస్తే జీవితంలో ప్రశాంతత, గౌరవం లభిస్తాయని లేదంటే జీవితం దుర్బలం అవుతుందని వివరించారు. వారికి ఎలాంటి న్యాయ సేవలు కావాలన్న జిల్లా న్యాయ సేవాధికర సంస్థకి తెలియజేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *