కె. తాడేపల్లి అంభపురం సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం కె.తాడేపల్లి అంభపురం సచివాలయాలను శనివారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాయంలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరిగైన సేవందించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే వాల్ పోస్టర్లను, బోర్డులను సచివాలయంలో అందుబాటులో వుంచింది లేనిది ఆయన పరిశీలించారు. ప్రజలు తిలకించేలా ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు కోవిడ్ నివారణ సూచనలు, వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన పరచాలన్నారు. గ్రామంలో పెన్షన్లు, రేషన్ పంపిణీ తీరును సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. ప్రతి వారం సోమ,మంగళ, బుధవారంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టార్లను ఆయన పరిశీలించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత సిబ్బందితో సమీక్షించారు. ప్రజలకు సేవలందించడంలో ఏ ఒక్కరూ కూడా జాప్యం , నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *