-నిందితుడిని వెంటనే అరెస్టు చేయండి
-ఇన్చార్జి ఎస్పీకి మంత్రి సవిత ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో యువతిని అతి కిరాతకంగా కత్తితో దాడి చేసిన ఉన్మాది కుళాయప్పను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడును జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ప్రేమించాలంటూ యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే ఇన్చార్జి ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితుడిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతికి మెరుగైన వైద్యమందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. యువతికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడు ఎంతటివాడైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈ మేరకే మంత్రి క్యాంపు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుల చేసింది.
Prajavartha Online Telugu News