Breaking News

కనకదుర్గమ్మను దర్శించుకున్న విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ…


ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారము రోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంనకు కర్ణాటక లోని హంపి పీఠాధిపతులు  విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ  శ్రీ అమ్మవారి దేవస్థానం నకు విచ్చేయగా, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ  డా.జి.వాని మోహన్, ఐఏఎస్,  ఆలయ కార్యనిర్వహనాధికారి  డి.భ్రమరాంబ  ఆలయమర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి పలికారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ప్రిన్సిపల్ సీక్రెటరీ  మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి, పాలకమండలిసభ్యులు ఎన్. సుజాత మరియు వైదిక కమిటీ సభ్యులు, ప్రధానార్చకులు స్వామీజీ వారికి పూలు పండ్లు, శ్రీ అమ్మవారి ప్రసాదములను సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణం చేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ప్రిన్సిపల్ సీక్రెటరీ  మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి, పాలక మండలిసభ్యులు ఎన్. సుజాత  స్వామీజీ వారికి శ్రీ మల్లేశ్వరస్వామి వారిని దర్శనం కల్పించి, మల్లేశ్వరస్వామి వారికి పూజలు నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *