ప్రజాసమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పరిష్కార వేదిక : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరానికి జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం రెండవ రోజు 22 వ డివిజన్ లో పరిష్కర వేదిక కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి తో కలిసి దేవినేని అవినాష్ ప్రజల సమస్యలను, సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణలంక ప్రాంతం వైస్సార్సీపీ కి కంచుకోట అని అందుకే గత టీడీపీ హయాంలో అభివృద్ధి కి నోచుకోక పాలకుల నిర్లక్ష్యనికి గురైందని,కానీ నేడు వైస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్లు, మంచినీటి పైప్ లైన్,సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేస్తున్నామని,ఆ నమ్మకం తోనే ప్రజలు మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ డివిజిన్ అభ్యర్థిని దాదాపు 3000 ఓట్లతో భారీ విజయాన్ని అందించారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నాయకత్వం లో కులమత పార్టీలకతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏదైనా సాంకేతిక కారణాలతో ఎవరికైనా సంక్షేమ ఫలాలు అందకపోతే ఈ పరిష్కార వేదిక లో చెబితే వెంటనే సంబందిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వైస్సార్సీపీ పార్టీ నాయకులు నిత్యం ప్రజలలో తిరుగుతూ వారికి అందుబాటులో వుంటున్నారని,కానీ ప్రతిపక్ష టీడీపీ నాయకులు జూమ్ లో తప్ప బయట కనపడరు అని ఎద్దేవా చేశారు. కేవలం వారి రాజకీయ మనుగడ కోసమే అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్లు,ఇంచార్జ్ లు మరియు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *