Breaking News

నిరుపేదలకు బియ్యము, చీరలు, కూరగాయలు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
60వ డివిజన్ వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ హోటల్ సెంటర్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ వారి సౌజన్యంతో Ln.వి.అప్పలరాజు  జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కరోన కష్ట కాలంలో ఉన్న ప్రజలకు బియ్యము, చీరలు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. రామరాజు మాట్లాడుతూ ప్రతీనిత్యం సేవా కార్యక్రమాలు చేస్తున్న అప్పలరాజు ని అభినందిస్తూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. అప్పలరాజు  మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించి వారి ఆరోగ్యం పట్ల చూపించిన శానిటరీ సిబ్బందికి చిరు సత్కారం చేయటం జరిగిందినిరంతరంగా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్న కు లయన్స్ క్లబ్ తరుపున మొమెంటోతో సత్కరించటం జరిగింది.ముఖ్య అతిధులుగా Ln. డి.వి.యెస్. రామలింగరాజు (ప్రెసిడెంట్) , Ln. ఎ. కుసుమ (సెక్రెటరీ), Ln.శ్రీనివాసరెడ్డి (కోశాధికారి) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు  రామరాజు, కంచి ధన శేకర్, రైల్వే ప్రసాద్, డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వయోవృద్ధుల పోషణ, డిజిటల్ మోసాల నియంత్రణకు చట్టాలు సవరించాలి

-పార్లమెంట్‌లో రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టిన వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *