త్యాగాలకు ప్రతీక బక్రీద్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలు, పేదల పట్ల దయ, దాతృత్వానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అభివర్ణించారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ప్రార్థ‌న‌ల్లో పాల్గొనాల‌ని కోరారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *