విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కెబిఎన్ కాలేజీ ఫ్రిబవరి 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఫంక్షనల్ అండ్ స్మార్ట్ మెటీరియల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పోస్టర్ ను ఎంపి కేశినేని శివనాథ్ ఆదివారం కె.బి.ఎన్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ కాన్పరెన్స్ ను కె.బి.ఎన్ కాలేజీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని కెబిఎన్ కళాశాలలోని ఫిజిక్స్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ తోపాటు ఎలక్ట్రానిక్స్ విభాగం కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కె.బి.ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, ఎస్.కె.పి.వి.వి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఎ.వో డాక్టర్ వి.నారాయణ రావు, కెబిఎన్ సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ టి.శ్రీనివాస్, సెమినార్ కన్వీనర్ డాక్టర్ వి. రవికుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News