Breaking News

పెనుగొండలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సుడిగాలి పర్యటన…

పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను నాణ్యతా ప్రమాణాలు తో మరమ్మత్తు లు చెయ్యాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరకువాడ రంగనాధ రాజు ఆదేశించారు. పెనుగొండ లో శుక్రవారం వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను మంత్రి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాధ రాజు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున నియోజక వర్గంలో పలు ఆర్ అండ్ బి, పంచాయ తీ రాజ్ రహదారు లు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించే దిశలో వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించి, కొన్ని రహదారుల్లో మరమ్మత్తులు చేపట్టారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి రహదారులను పరిశీలించామన్నారు. మరమ్మత్తులు చేపట్టాలని అధికారుల కు సూచించామని అన్నారు. పెనుగొండ పరిధిలో దెబ్బతిన్న రహదారి మార్గాల్లో తాను అధికారులు ఆకస్మాత్తుగా పర్యటించడం జరిగింది అన్నారు. ఆయా రహదారుల మరమ్మత్తులకు చెప్పట్ట వలసిన చర్యలపై అధికారులతో వివరాలను మంత్రి అడిగి తెలుసుకునీ, రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. మండలం లో పర్యటించిన మంత్రి వర్యులు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులను, పంచాయతీ రాజ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులను, పంచాయతీ రాజ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *