శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ  అమ్మ వారికి ముగిసిన శాకాంబరి దేవి ఉత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో శాకంబరీ దేవి గా మూడవ రోజు భక్తులకు శనివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీ గా దర్శనం ఇచ్చారని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు లింగిపిల్లి అప్పారావు, మరు పిళ్ళా హనుమంతరావు, కొర్ర గంజి భాస్కర్ రావు లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాడ మాసంలో వచ్చే శాకంబరీ దేవి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని మరి ఈరోజు గురుపౌర్ణమి కావడంతో భక్తులు వేకువ జాము నుండే పెద్ద మొత్తంలో వచ్చారని ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి భక్తులు మాస్కులు ధరించి సమదూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నుదురుమాటి కృష్ణ ప్రసాద్ శర్మ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *