యోగివేమన జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దార్శనికుడు ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగివేమన జయంతి సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో యోగివేమన గారి చిత్రపటానికి పూలమాలవేసి వారు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు యోగి వేమన, సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో పద్యాలను వినిపించి అందరిని మెప్పించిన మహాకవి వేమన అని అన్నారు. వేమన ఒక ప్రజాకవి, సంఘ సంస్కర్త అని, ఆయన పద్యాలను వినని వారు, తెలియని వారుండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అటువంటి మహనీయుని జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవడం, భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, వేమన ఆవిష్కరించిన నైతిక విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు, ట్రైనీ ఐ. పి. ఎస్. మనీషా గారు, సి. పి. ఓ అధికారులు, పోలీస్ అధికారులు, సి.పి.ఓ.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *