Breaking News

ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంకు ఆన్లైన్ పోర్టల్ విధానం ద్వారా ధరఖాస్తుల ఆహ్వానం

-యువతలో నైపుణ్యాభివృద్ధికి.. పీఎం ఇంటర్న్షిప్ పథకం
-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. Dr.S.వెంకటేశ్వర్, ఐఏఎస్, 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభమైందని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ Dr.S. వెంకటేశ్వవార్, ఐ.ఏ.ఎస్,  తెలియజేశారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యపరమైన శిక్షణతో కూడిన విద్యను 12 నెలలు పారిశ్రామిక అనుభవం అందించాలని సంకల్పించింది. 20 కంటే ఎక్కువ రంగాలలో యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్షిప్ చేయాలనుకునే వారికి దేశవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయి.

విద్యార్హతల విషయానికొస్తే..
ఇంటర్న్షిప్ స్కీమ్కు అర్హత సాధించడానికి, దరఖాస్తుదారులు తమ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. ITI నుండి సర్టిఫికేట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా లేదా BA, BSc, BCom, BCA, BBA, BPharm వంటి డిగ్రీని కలిగి ఉండాలి. ఆన్లైన్ లేదా దూరవిద్య ప్రోగ్రామ్లలో నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం
భారత ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద చేరే ప్రతీ ఒక్కరికీ బీమా కవరేజీ అందిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకోవాలి అని కోరారు. https://pminternship.mca.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈ ఇంటర్న్షిప్ కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని, ఎంపికైన వారికి 12 నెలలపాటు రూ.5 వేల చొప్పున అందిస్తారని, ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారు అని, ఇంటర్న్షిప్ జనవరి 10వ తేదీన ప్రారంభమైందని, జనవరి 21వ తేది ఆఖరు తేది అని తెలిపారు.వయస్సు: 21-24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు అని, కావున తిరుపతి జిల్లా యువత ఈ సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ Dr.S. వెంకటేశ్వర్, ఐఏఎస్ గారు, ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కొరకు ,9988853335, 9160912690, 81435 76866 నంబర్లను సంప్రదించగలరు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి,  నరసింహులు, జిల్లా ఉపాధి కల్పనాధికారి, .వెంకటరమణ,జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, ఆర్ లోకనాథం, ఏ గణేషు ప్లేస్మెంట్ ఆఫీసర్, శ్రావణి, హెచ్ఆర్, ఏపీ ఎస్ ఎస్ డి సి,సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *