విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నుంచి సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఆడియో విజువల్ సూపర్వైజర్ వేమూరి వెంకటేశ్వర ప్రసాద్ ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సమాచార శాఖ ద్వారా చేపట్టే ప్రజా సంబంధాల కార్యక్రమాల్లో ఉత్తమ సేవలకు గాను ఉద్యోగులకు ఈ గౌరవం లభించింది.
Prajavartha Online Telugu News