విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత కరెంటు అందించే ఉద్దేశంతో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ప్రధాన మంత్రి సూర్య ఘర్ – ముప్తి బిజ్లి యోజన పథకం ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళాల ప్రజలకి తెలియచేయడానికి సచివాలయం సిబ్బందితో కలిసి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ప్లే కార్డ్స్ పట్టుకొని ప్రతి వీధిలో ర్యాలీ నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ 49 వ డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్కరూ బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఇంటి మీద సోలార్ పలకలు ఉపయోగించుకొని మీకు చాలినంత కరెంటు ఉపయోగించుకొని మిగతా కరెంటు ప్రభుత్వానికి అమ్మే పథకం ఏదైతే ఉందో దానిని సక్రమంగా ఉపయోగించుకోగలరని ప్రజలందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ విగ్నేష్ సచివాలయ సెక్రటరీలు సిబ్బంది పాల్గొన్నారు
Prajavartha Online Telugu News