Breaking News

దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా అభివృద్ధి చేసిన ఘనుడు ఏపీజే అబ్దుల్ కలాం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీజే అబ్దుల్ కలాం కు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  ఘన నివాళులు అర్పించారు. నందిగామ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కలాం చిత్రపటానికి శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి ఏపీజే అబ్దుల్ కలాం చేసిన కృషి మరువలేనిదని ,శాస్త్రవేత్త గానే కాకుండా రాష్ట్రపతిగా దేశానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం భారతదేశపు అత్యున్నత పురస్కారాలైన భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, 40 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లతో పాటు ఎన్నో పురస్కారాలు పొందారని, నేటి యువత అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , వార్డు ఇంచార్జ్ లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *