సెర్ప్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన ఏ. యండి. ఇంతియాజ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టి (సెర్ప్) రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏ.యండి. ఇంతియాజ్ పదవిబాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్న ఆయనను సెర్ప్ సిఇఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఏ.యండి. ఇంతియాజ్ గురువారం విజయవాడ ఆర్టిసి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో గల సెర్చ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎ గ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *