Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. బుధవారం కృష్ణలంక ApSrm స్కూల్ ఆవరణలో స్థానిక 21 వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న బాటలో పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన 90 శాతం పైగా హామీలను అమలు చేయడంతో పాటు,నేడు ప్రజలలోకి వెళ్తుంటే ప్రభుత్వ పనితీరుపై, సంక్షేమ పథకాలు అమలు తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ వైస్సార్సీపీ నాయకుల కు బ్రహ్మరథం పడుతున్నారు అని,రాబోయే 30 సంవత్సరలు జగన్ గారే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు అంత కోరుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రజలు కోరుకొన్న విధంగా సహాయం అందజేస్తున్న ఘనత ప్రభుత్వానిదే అని, హామీ ఇవ్వకపోయినా సరే కాపు మహిళల సంక్షేమం కోసం కాపు నేస్తం వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. సచివాలయ,వాలంటర్ వ్యవస్థ తీసుకువచ్చి ప్రజలు గతంలో లాగా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందజేయడం, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడం చేస్తున్నారు అని తెలిపారు. ప్రజలలో రోరోజుకీ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు చేసే నీచ రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఇక వారి పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు. చిట్టచివరి పేదవాడి వరకు సంక్షేమ పథకాలు అందాలి అనే లక్ష్యంతో ఈ పరిష్కార వేదిక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందని, ఎవరికైనా ఏదైనా సాంకేతిక కారణాల వలన పధకం అమలు కాకపోతే ఈ పరిష్కార వేదికలో మా దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారు.ఏ నమ్మకంతో అయితే కుమారి గారిని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా నిత్యం మీకు అందుబాటులో ఉంటూ,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఉద్ఘటించారు. ఈ డివిజిన్లో ఇప్పటికే శరవేగంగా జరిగుతున్న అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేస్తామని, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ఇండోర్ స్టేడియం మరియు వాకింగ్ ట్రాక్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు.మహిళలకు రక్షణ గా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ ఆప్ ప్రతి మహిళా ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు,కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మీర్ హుస్సేన్,VMC ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం మరియు కార్పొరేటర్లు,డివిజన్ ఇంచార్జీలు, నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *