కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని, జగనన్న లేఅవుట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్, శాసనసభ్యులు డా.మొండితోక జగన్మోహన్ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రీయ విద్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే తాత్కాలిక తరగతుల నిర్వహణకు వసతి ఏర్పాట్లను బుధవారం నందిగామ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహన్ తో కలసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు తరగతిగదుల నిర్మాణానికి సంబంధించి పనులపై అధికారులతో సమీక్షించారు. పాలిటిక్నిక్ కళాశాలలో అవసరమైన మరమత్తులను కూడా పూర్తి చేయాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయంకు కేటాయించిన 5.34 ఎకరాల భూమిని కూడా కలెక్టర్ జె.నివాస్ శాసనసభ్యులు డా. మొండితోక జగన్మోహన్ రావు పరిశీలించారు. అనంతరం జగనన్న లేఅవుట్ లో ఇళ్ల స్థలాలు పరిశీలించి లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టే విధంగా తగు బాధ్యత తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. లేఅవుట్ బాగుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. వీరి వెంట తహాశీల్దార్ బి. చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్ డా.జయరాం, యంపిడివో లక్ష్మిలీలా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *