సచివాలయ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తూ ప్రజలకుఅందుబాటులోఉండాలి… : కలెక్టరు జె. నివాస్ 

-నిర్ణీత సమయంలోనే ప్రజాసమస్యలుపరిష్కరించాలి..
-ప్రభుత్వపథకాలవివరాలను తెలియజేసేబోర్డులను ప్రదర్శించాలి..
-గ్రామల్లోఫీవర్సర్వేపక్కాగానిర్వహించాలి…
-కోవిడ్ కట్టిడికి “నోమాస్క్నోఎంట్రీ – “నోమాస్క్ – నోరైడ్”- “నోమాస్క్ – నోసేల్ ” నినాదాలతో ప్రజలకు
ప్రత్యేక అవగాహన కల్పించాలి…

జగ్గయ్యపెట, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్నసేవలకు సంబందించి ఏఒక్క అంశం పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తూ బాధ్యతాయుతంగా విధులనునిర్వహించాలని కలెక్టరు జె. నివాస్ సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరు జె. నివాస్ జగ్గయ్యపేట 7 వ వార్డులో గల వార్డు సచివాలయనాన్ని ఆకస్మికతనిఖీచేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శి, వివిధశాఖలకు సంబందించి ప్రభుత్వపథకాల అమలుపై పర్సన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్నరిజిష్టర్లు, అటెండెన్సు, మూమెంట్ రిజిష్టర్ల, బయోమెట్రిక్ ప్రక్రియ నిర్వహనను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పథకాలను సకాలంలో ప్రజలకు చేరవచేయాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను స్ధాపించిందన్నారు. సచివాలయ ఉద్యోగులందరూ సమయపాలన పాటిస్తూ శాఖా పరంగా వారు చేస్తున్న పనులను సకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వార్డు, గ్రామ సచివాలయాలు ద్వారా ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సర్వీసులకు సంబందించి ఏఒక్కటీ పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాలవ్యవధిలోనే సచివాలయ ఉద్యోగులుపరిష్కరించాలన్నారు. ప్రతి సచివాలయంలో ప్రభుత్వపథకాలు, వాటిఅర్హతలు, సచివాలయం ద్వారా అందించే సేవలు, లబ్దిదారుల వివరాలతో కూడిన బోర్డులు ప్రజలకు తెలిజేసే విధంగా ప్రదర్శించాలన్నారు. ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా ఆయా గ్రామకార్యదర్శులు, సంబందిత శాఖల పర్సన్ అసిస్టెంట్లు పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కోవిడ్ నుంచి రక్షణకు వ్యాక్సినేషన్ ప్రధాన మార్గం… : కలెక్టరు జె. నివాస్
కోరోనా కట్టిడికి వ్యాక్సినేషన్ ప్రధానమార్గమని ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా సచివాలయ పరిదిలో అవగాహన కల్పించాలన్నారు.

కోవిడ్ నియంత్రణకు ప్రతి వారం పక్కాగా ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్ళి నిర్వహించాలి… : కలెక్టరు జె. నివాస్
కోవిడ్ మూడవ దశ ప్రభలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నందున జిల్లాలోని గ్రామ, ప్రట్టణ ప్రాంతాల్లో ఆయా సచివాలయాల వాలెంటీర్లు, ఆశా, వైద్యసిబ్బంది ఫీవర్ సర్వే పక్కాగా ఇంటింటికీ వెళ్ళి నిర్వహించాలన్నారు. సర్వేకు వెల్లకుండా వెళ్లినట్లు నివేదికలు ఇస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రతివారం సోమ, మంగళ, బుధవారాల్లో కోవిడ్ కట్టడికి “నోమాస్క్నోఎంట్రీ- “నోమాస్క్ – నోరైడ్”- “నోమాస్క్ – నోసేల్” నినాదాలతో ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరు వెంటతాహశీల్థార్,యంపీడీవో, మున్సిపల్ కమీషనరు,సచివాలయ ఉద్యోగులు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *