విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 13న వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను స్థానిక లబ్బిపేటలోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న దృష్ట్యా సంబంధిత ఏర్పాట్లను సోమవారం ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశీల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ , సమాచార శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి, టూరిజం సిఇఓ విజయ్ కృష్ణాన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, వియంసి కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ కె. మోహన్ కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణచంద్ తదితరులు పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి పురస్కరించుకుని ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను ఈ నెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానం చేయడం జరుగుతుందని అందుకు సంబంధించిన ఏర్పాట్లను పటిష్టమైనరీతిలో చేయాలని తలశీల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణా మోహన్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వారు సమీక్షించారు.
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …