తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
“ఆపరేషన్ సింధూర్”లో భాగంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు మద్దతుగా ఇండియన్ ఆర్మీ కి తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరపున భారత సైన్యానికి రూ. 3.15 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ను విరాళంగా హోండా మోటార్స్ పృథ్వీ బిజెపి నేత మరియు టీటీడీ బోర్డు సభ్యులు అయిన భాను ప్రకాష్ రెడ్డి తనయుడు పలువురు ఆటోమొబైల్ డీలర్ లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ కు అందజేశారు. దేశం కోసం నిరంతరం పాటు పడుతున్న సైనికులకు మద్దతుగా నిలిచిన డీలర్ అసోసియేషన్ ప్రయత్నాలను కలెక్టర్ అభినందించారు.
Prajavartha Online Telugu News