-రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్ననందున కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు, సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దని,రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్ పోర్టులో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చూసించారు,వృద్ధులు, గర్భవతులు ఇళ్ల నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు తెలిపారు,విదేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. మాస్కులు, పీపీ,ఈ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని,వైద్యాధికారులకు ఆదేశించిన మంత్రి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఎంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు, ముక్యంగా ప్రభుత్వ హాస్పటల్లో కోవిడ్ ను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మెరుగైన వైద్యానికి వైద్యపరికారాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు అదేదించారు, ప్రత్యేక పర్యవేక్షణతో సమన్వయంతో అధికారులు పనిచేయాలన్నారు,కోవిడ్ ను ఎదుర్కోవడానికి గ్రామ, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చూడాలని ఆదేశించారు,క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి చూసించారు,ప్రజలంతా మాస్క్, శానిటేషన్, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనవచ్చన్నారు,
Prajavartha Online Telugu News