ప్ర‌తిరోజు ప్ర‌తి ఇంటికి మంచినీటి సరఫరా…

-100 కోట్లు రూపాయ‌ల‌తో అమృత్ పథకాన్ని ప్రారంభించిన మంత్రులు బొత్స‌, వెలంప‌ల్లి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేపట్టంద‌న్నారు. అందులో భాగంగా ఈ రోజు ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు 100.07 కోట్లు రూపాయ‌ల‌తో అమృత్ పథకానికి శ్రీ‌కారం చుట్టిన్న‌ట్లు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.
శ‌నివారం ఐనాక్స్ థియేటర్ వెనుక సాంబమూర్తి రోడ్ లో అమృత్ పథకంలో భాగంగా 24X7 మంచినీటి సరఫరాను ప‌థ‌కాన్నికి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, జిల్లా క‌లెక్ట‌ర్ నివాస్ ఐ.ఏ.ఎస్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్, డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌, ఆవుతు  శైల‌జా రెడ్డి, న‌గ‌ర పాల‌క సంస్థ‌ కార్పొరేట‌ర్లుల‌తో క‌లిసి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుంకుస్థాప‌న చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ నిధులతో పాటు న‌గ‌ర పాల‌క సంస్థ నిధుల‌తో ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువ‌స్తాం అన్నారు. ఈ ప‌ధకం న‌గ‌రంలో 29 వార్డుల‌కు 24X7 మంచినీటి సరఫరాను అందిస్తుంద‌న్నారు. విజయవాడకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు.. కార్య‌క్ర‌మంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఈ ఈ శ్రీ‌నివాసు, ఇంజ‌నీరింగ్ విభాగం అధికారులు, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *