Breaking News

48 గంటల్లో అల్పపీడనం: ఏపీ లో పలు చోట్ల భారీ వర్షాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తులో దక్షిణం వైపు ఉంది. దీని ప్రభావంవల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని కేంద్రం వివరించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి!

-ఎన్నికల విధానంలో, ప్రజాస్వామ్య విధానాల అమలులో మార్పు రావాలి!! -నగర సమగ్రాభివృధికి 50 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి!!! …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *