Breaking News

సామ‌న్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదికగా స్పందన‌… : మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామ‌న్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కొర‌కు ఆహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తూ వారి జీవితాల‌లో వెలుగులు నింప‌డ‌మే ల‌క్ష్యంగా స్పందన కార్యక్రమం అని మేయర్ శ్రీ‌మ‌తి రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో భాగంగా నగరపాలక సంస్థ ప్ర‌ధాన కార్యాయలం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకోవటం జరుగుతుందని మేయర్ తెలిపారు. గ‌త నెల జూలై 26వ తేదీన స్పంద‌న పున ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని, అప్ప‌టి నుంచి ఆగ‌స్టు 2, 9, 16, 23 వ తేదీ క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు స్పందన కార్యక్రమము జ‌రిగాయ‌న్నారు. ఇందులో ప్రజలు నేరుగా 81 సమస్యల అర్జీలను అందించగా 59 అర్జీలను పరిష్కరించుటం జరిగిందన్నారు. ఆర్ధిక పరమైన 20 అర్జీలు, పునపరిశీలనలో 2 అర్జీలు క‌లిపి మొత్తం 22 ఆర్జీలు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించ‌టం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తి సోమవారాలు అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో ప్రజలు నేరుగా అందించిన అర్జీలను సంబందిత వెబ్ సైట్ నందు నమోదు చేసి సంబందిత అధికారులకు పంపించుట జరుగుతుందన్నారు. అధికారులు లేదా క్షేత్ర స్థాయి సిబ్బంది క్షేత్ర స్థాయితో పాటు పరిశీలించి సమస్యలను పరిష్కరించుట జరుగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించిన తదుపరి అర్జీ దారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోని స్పందన వెబ్ సైట్ నందు అప్ లోడ్ చేయుటం జరుగుతుందని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *