విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబేకాలనీ రెండు ఎకరాల స్థలంలో మినీ బస్ స్టేషన్ నిర్మాణం పై చర్చించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గురువారం ఆర్టీసీ భవన్లో సమావేశం అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలకు అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే మల్లాది విష్ణు వినతి మేరకు వాంబే కాలనీలో మినీ బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని గతంలో నగర పాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిన విషయం విధితమే.
Prajavartha Online Telugu News