మంత్రి క్యాంపు కార్యాలయంలో పద్మభూషణ్ గుర్రం జాషువా 126 వ జయంతి…

-క్యాంపు కార్యాలయంలో గుర్రం జాషువా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళి..
-నివాళి అర్పించిన మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక ప్రయోజనం ఆశించి తన రచనలు ద్వారా చైతన్యం తీసుకుని వొచ్చిన ఆధునిక కవి గుర్రం జాషువా అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినా తాన పదునైన రచనలతో సామాజిక మార్పుకోసం కృషి చేసారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి మహోన్నత వ్యక్తిత్వం గుర్రం జాషువా వారిదని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వి. శ్రీనివాస రావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పరిసరాల పరిశుభ్రత మనఅందరి బాధ్యత..పరిశుభ్రతతోనే ఆరోగ్యం…

-పత్రి ఒక్కరిలో స్వచ్ఛత పై అవగాహన కలిగించాలి.. -స్వచ్ఛత-శుభ్రత పై ప్రజలు నైతిక బాధ్యత వహించాలి.. -మురుగు కాలువగట్లపై చెత్తను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *