కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హంసలదీవి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హంసలదీవిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి హంసలదీవి బీచ్ సందర్శించారు. మంత్రి వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, బందరు ఆర్డీవో ఎన్ఎస్ కే ఖాజావలి, డిఎస్పి మహబూబ్ బాషా, తాసిల్దార్ లతీఫ్ భాష, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Prajavartha Online Telugu News