-ఈ నెల 20 కి బదులు 19 కి మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను ఈ నెల 19 కి మారుస్తూ ప్రభుత్వం జి.ఓ.ఆర్టీ.నెం.1707 ను సోమవారం జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను గతంలో ప్రకటించినట్లుగా ఈ నెల 20 కి బదులు 19 కి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఈ ఉత్తర్వులను జారీచేశారు.
Prajavartha Online Telugu News