Breaking News

విజయగాధ…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ గోదావరి జిల్లాలో వై. ఎస్. ఆర్. ఆసరా సొమ్ము దసరా ఉత్సవాలలో పండుగ బహుమతులు గా డ్వా క్రా మహి ళల నేరుగా వారి బ్యాంకు ఖాతా లోకి నేరుగా జమ చేయడం తమని ఎంతో ఆనందానికి గురిచేసిందని ఎమ్. ఆనంతలక్ష్మి పేర్కొన్నారు.
రాష్టము లో ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినపుడు ఇచ్చిన హామీ ప్రకారం 4 విడతల్లో రూ. 27 వేల కోట్ల డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు చెందిన రుణాలను మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు వై ఎస్సార్ ఆసరా పధకం ద్వారా రెండో విడత ఆ మొత్తాలను డ్వా క్రా మహిళల ఖా తా ల్లో కీ ప్రభుత్వం జమ చేసింది. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి, మహిళలకు అన్నగా, పిల్లల మేనమామ గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు ప్రజల మన్ననలు పొందుతున్నారు. వై ఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత పధకం ద్వారా నిడదవో లు నియోజకవర్గంలో రూ.185.25 కోట్ల మేర మహిళల ఖాతాల్లో కీ జమ చేయడం జరిగింది. దసరా కానుకగా రెండో విడత గా రూ.46.32 కోట్లు అందించారు. డ్వాక్రా మహిళలు సీఎం ఆదరణ పై స్పందిస్తూ, మాట ఇచ్చాడంటే తిరుస్తాడు.. అంటున్నారు.
మహిళలు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు గా నిలబడాలని ముఖ్య మంత్రి ఆకాంక్షించారు. ఆ దిశలోనే అన్ని సంక్షేమ పథకాలు మహిళలు పేరునే ఇవ్వడం జరుగుతోంది. ప్రతి ఇంటిలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలు లో కనీసం ఒకటి రెండు పథకాల ద్వారా ప్రయోజనం పొందని వారు ఉండరంటే అతిశ యోక్తి కాదు. కోవిడ్ మొదటి, రెండవ విడత విజ్రూంభించి ప్రజల ను ఇబ్బంది పెట్టిన ప్రజల పక్షాన ఉండి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల ప్రాణాలను ప్రభు త్వం కాపాడింది. రాష్ట్రం ఆర్థిక లోటు లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్య స్తంగా ఉన్నా, వేరవకుండా పేదల పక్షన్న నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనడం లో అతిశయోక్తి లేదు.
గత ప్రభుత్వం 2014 లో అధికారం లోకి రావడానికి మహిళల రుణమా ఫీ చేస్తామని చెప్పి, 5 సంవత్సరా లు బ్యాంక్ అధికారులను ఇంటిపైకి పంపించి వడ్డీకి, చక్ర వడ్డీ కట్టించు కున్నరు. జగనన్న రుణాలు బ్యాంకు కి చెల్లించండి, మీ అప్పులు నేను తిరుస్తాను అని హామీ ఇచ్చి 4 విడ తల్లో భాగం గా నేడు రెండో విడత అందించారు. వైఎస్సార్ ఆసరా పథకం మహిళ లకు ఆర్ధిక భరోసా ను కల్పించింది. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం వైఎస్సార్ కు టుంబ నేపధ్యం పాదయాత్ర సమయం లో ప్రజల ఇబ్బందులు దగ్గిర నుండి చూసి మనసున్న నాయకుడిగా అధికారంలోకి వొచ్చి న వెంటనే అక్క చెల్లమ్మ లు చెల్లిం చిన డ్వాక్రా రుణాలు తిరిగి వారి బ్యాంకు ఖాతాలను జమ చేస్తానని చెప్పారని, నేడు చేతల్లో అది చూపారు. మొత్తం నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని 4,815 గ్రూపులకు 11.4.2019 న ఉన్న అప్పు రూ.185.25 కోట్ల ఉందన్నా రు. తొలి విడత సొమ్మును గతేడా ది సెప్టెంబర్ 11న ఇచ్చామన్నారు. ఈ దఫా రెండో విడతగారూ.46.32 కోట్లు విడుదల చేయడం జరిగింది.
ఇందులో భాగంగా నిడదవోలు మండలం పరిధిలోని 1438 గ్రూపు లకు ఉన్న అప్పు రూ. 48.09 కోట్ల లో రెండో విడతగా రూ.12.03 కోట్లు విడుదల చేయడం జరిగింది. నిడదవోలు పురపాలక సంఘం ప రిధిలోని 546 గ్రూపులకు 11.4.2019 న ఉన్న అప్పు రూ. 17.04 కోట్ల లో రెండో విడతగా రూ. 4.27 కోట్లు విడుదల చేయ డం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్యవైశ్యుల అండ బోండా ఉమానే.. వెల్లంపల్లివి అవాకులు చెవాకులు!.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు,పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *