విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రి ఫై వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గ అమ్మవారిని APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగ రెడ్డి దర్శించుకున్నారు. దుర్గగుడి సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దేవాలయం లో ఆయనను వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపిఆశీర్వదించారు. అనంతరం మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సోదరులు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కరోనా బారిన ఈ ఒక్క జర్నలిస్టు పడకూడదని అమ్మవారిని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో APWJU కృష్ణ విజయవాడ అర్బన్ అధ్యక్షులు షేక్ నాగూర్. మానేపల్లి మల్లికార్జునరావు, బేవర రవీంద్ర కుమార్, రమేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News