Breaking News

ఏపీ పారిశ్రామిక ప్రగతి సోపానంగా ఎంఎస్ఎంఈలు పార్కులు

-ఈ నెల 25 తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026
-38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-మెటా, అమెజాన్ లాంటి సంస్థలతో ఒప్పందాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేస్తోంది. ఈ నెల 25 తేదీన విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు హాజరై రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంఎస్ఎంఈల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ సహా పలువురు మంత్రులు పారిశ్రామిక వేత్తలు సదస్సు లో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థలు సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.
రాష్ట్రంలో ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో ఈ సదస్సు వేదికగా ముఖ్యమంత్రి పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజక వర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసే లక్ష్యం లో భాగంగా మూడో విడతలో ఈ 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే మొదటి రెండు దశల్లో 100 పారిశ్రామిక పార్కులకు శంకు స్థాపన తో పాటు కొన్ని ప్రారంభం అయ్యాయి. వీటిలో 761 యూనిట్లకు కేటాయింపులు జరిగాయి. ఈ పారిశ్రామిక యూనిట్ల ద్వారా రూ.1479 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 24 వేల మంది కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి.

ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్‌టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించనున్నారు.
రూ.200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు నిధులను కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. ఈ సమ్మిట్ లో యువతకు, మహిళలకు అవగాహన కల్పించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. మొత్తంగా
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేలా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ప్రణాళిక చేసిన ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026′ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *