Breaking News

రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. సోమవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు.

ఇవాళ కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4డిగ్రీలు నమోదైనట్లు పేర్కొన్నారు. 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు 20, కృష్ణా 18, బాపట్ల 17, ఏలూరు 13, ఎన్టీఆర్ 13, గుంటూరు 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపిందన్నారు.

మంగళవారం (26-05-2026) 26 మండలాల్లో తీవ్రవడగాల్పులు,137 మండలాల్లో వడగాల్పులు, బుధవారం 70 తీవ్ర, 176 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/83ad07221c37be5198bf3b34c4e8e4b1.pdf

మే 26 మంగళవారం

▪️ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

▪️ విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 – 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

▪️ శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 – 42 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు.

మే 27 బుధవారం

▪️ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

▪️విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి ఏలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 – 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

▪️ శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 40 – 42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మే 28 గురువారం

▪️ కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి ఏలూరు మరియు పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

▪️పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 – 44 డీగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

▪️ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 40 – 42 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

సోమవారం కృష్ణా(జి) కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీలు, బాపట్ల(జి) కూచినపూడిలో 46.4డిగ్రీలు, ఎన్టీఆర్(జి) ఇబ్రహీంపట్నం, పల్నాడు(జి) పిడుగురాళ్లలో 46.3డిగ్రీలు, ఏలూరు(జి)కుక్కునూరు, పోలవరం(జి) కూనవరంలో 46.1, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 45.7, ప్రకాశం(జి) కొప్పెరపాడు 45.4, కోనసీమ(జి) శివల, కాకినాడ(జి) కాజులూరులో 45.2, గుంటూరు(జి) మంగళగిరిలో 44.9, మార్కాపురం(జి) నందనమారెళ్లలో 44.7, విశాఖ(జి) ములగాడ 44.4, తూర్పుగోదావరి(జి) పోతవరం 44.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *