విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా తేళ్ల కస్తూరి సోమవారం (జూన్ 1 న) స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పూర్వపు సెక్రెటరీ మణిరామ్ రిటైర్మెంట్ కారణంగా ప్రస్థుతం జోన్ 3 జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న తేళ్ల కస్తూరి కి ‘సెక్రెటరీ’ గా పూర్తి అదనపు బాధ్యతలు కల్పిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ ఉత్తరువులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తరువుల ను అనుసరించి సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా పూర్తి అదనపు బాధ్యతలు ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా అకాడమీ మేనేజర్ ఎం. భాస్కర నారాయణ అకాడమీలో అమలవుతోన్న పలు కార్యక్రమాలను సెక్రెటరీ తేళ్ల కస్తూరి కి వివరించారు. ఈ సందర్భంగా పూర్వపు మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, పలువురు పాత్రికేయులు సెక్రెటరీ కస్తూరి బాయి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Prajavartha Online Telugu News