విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజకీయ చరిత్రలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అధిరోహించిన ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని ఏపీ సీసీ ఉపాధ్యక్షుడు వి.గురునాథం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రరత్నభవన్లో సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పని చేశారని కొనియాడారు. ఆయన నిస్వార్థ సేవలను నేటి తరం రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కాపు సెల్ అధ్యక్షుడు అల్లం రాజేష్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News