Breaking News

ఈనెల 3న బహుజన మాట- పాట సాంస్కృతిక చైతన్య కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ద్రావిడ ఉద్యమనేత ముత్తువేల్ కరుణానిధి 103వ జయంతి సందర్భంగా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 3న బహుజన మాట- పాట అనే సాం స్కృతిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ చైతన్య వేదిక ప్రతినిధులు వీరవల్లి శ్రీనివాస్, పానుగుపాటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, ఐఏఎస్ మాజీ అధికారి పీవీ రమేష్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు ఐక్యంగా ముందుకు రావాలని, కార్యక్రమంలో పాల్గొని విజయవం తంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి దేవి, బీసీ చైతన్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *