అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా జనసేన పార్టీ తరుపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు శనివారం అమరావతి అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపి అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. అఖిల్ కుమార్, పి.విజయ కుమారి,అదే విధంగా మంత్రి కొల్లు రవీంద్ర,ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు,ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు,పులవర్తి రామాంజనేయులు(అంజిబాబు) ఎన్.ఈశ్వరరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News