Breaking News

సచివాలయం ఆకస్మిక తనిఖీ…

-న‌గ‌ర పాల‌క సంస్థ అధనపు క‌మిష‌న‌ర్ (జనరల్) డా.జె. అరుణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే భాద్యత ప్రతి సచివాలయం సిబ్బందిపై ఉందని అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ పేర్కొన్నారు. శనివారం బ్రహ్మరెడ్డి నగర్ విశాలాంద్ర రోడ్ లోని 32, 33, 34 మరియు 35 సచివాలయాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి, సంక్షేమ పథకములకు సంబందించి పూర్తి వివరాలు విధిగా నోటీసు బోర్డులో ఉంచాలని సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి, మధురానగర్‌లో రూ.10 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

-‘ఇంటింటికీ తెలుగుదేశం’లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్డులోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *