అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ గా వి.చిన్నవీరభద్రుడు సోమవారం భాద్యతలు తీసుకున్నారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పి.రంజిత్ భాషా నుంచి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు చిన్నవీరభద్రుడు కి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ లొ 30 సంవత్సరాలు పైబడి వివిధ హోదాలలో పనిచేసి ఐఏఎస్ గాఎంపిక కాబడి విద్యా శాఖలొ SSA లో SPD గా మరియు విద్యా శాఖ డైరెక్టర్ గా రెండున్నర సంవత్సరాలు సేవలు అందించారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలములోప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నోసంస్కరణలు విజయవంతంగా పూర్తీ చేసి గుర్తింపు పొందియున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఫై పూర్తీ అవగాహన ఉన్నవ్యక్తి గా గిరిజన సంక్షేమ పధకాలను సమర్ధవంతంగా అమలు చేసి గిరిజనుల సర్వoతో ముఖాభివృద్ది కోసం కృషిచేయలనిఈ సందర్భంగా సిబ్బందికి సూచించుట జరిగినది.
Prajavartha Online Telugu News